LATEST UPDATES

Latest Updates

Latest; Information

Notifications

Friday 27 May 2016

About Nellore district


About Nellore District
State: Andhra Pradesh        District Name: Nellore      Region: Coastal Andhra 

Pin: 524000 Tele Code: +91 861 Vehicle Code: AP 08

Languages: Telugu Urdu Hindi Area: 13,076 Sq kms 
Nellore City: 250 Sq kms Population: 2,963,557 Jana Sandrata: 224 

Female: Male (East: Nishpathi) 1000 : 984 

Population Increase: 24%

Literacy: 68.90%SC Population: 5,00,000 plus ST Population: 2,00,000 plus 

MP Constituencies: 1 

: 10 
Nellore Rural Nellore Urban Kovuru AtmakurSarvepally 
Guduru Udayagiri Kavali Sullurupeta Venkatagiri
Muncipal Corporation;1  Nellore
 Muncipalities: 7 Kavali Guduru Sullurupeta Venkatagiri Kovuru Naidupeta
జిల్లా కలెక్టరు : 9849904051, 0861-233199, 2331235
జాయింట్ కలెక్టరు : 9849904052, 2331644, 2331624
జిల్లా రెవెన్యూ అధికారి : 9849904053
జిల్లా ప్రజాసంబంధాల అధికారి : 9949351619
సాంఘీక సంక్షేమ శాఖ డి.డి. : 0861 2327341
ఎస్.సి. కార్పొరేషన్ ఇ.డి. : 9849905971, 2324763, 2331576
బి.సి. కార్పొరేషన్ ఇ.డి. : 9849906012, 2322108, 2332962
ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి : 9440806688, 2327940, 2336363
వ్యవసాయశాఖ జె.డి. : 9440816768, 2326415, 2327264
పశుసంవర్థకశాఖ జె.డి. : 9440810761, 2331855, 2331454
స్త్రీ శిశు సంక్షేమ శాఖ పి.డి. : 9440455102, 2329481, 2346402
జిల్లా వైద్య ఆరోగ్యాధికారి : 9849902361, 2331435, 2323438
జిల్లా పరిషత్ ఛైర్మన్ : 9849499066, 2331670, 2331201
జిల్లా పరిషత్ సి.ఇ.ఒ. : 9866233370
నీటిపారుదలశాఖ ఎస్.ఇ. : 9440276580, 2327658, 2328540
రెవెన్యూ డివిజన్ పాలనాయంత్రాంగం
నెల్లూరు ఆర్డీవో 2331635 9849904055
డివిజనల్ పరిపాలనాధికారి 2331635 9849904061
గూడూరు ఆర్డీవో 251613 9849904056
డివిజనల్ పరిపాలనాధికారి 251087 9849904062
కావలి ఆర్డీవో 241564 9849904054
డివిజనల్ పరిపాలనాధికారి 241564 9849904060

నెల్లూరు జిల్లా నాగరికతకు పుట్టినిల్లు. ఎన్నో శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. అక్కడక్కడ విసిరేసినట్లు నివాసాలు కనిపించేవి. ఆదివాసీలు ఎక్కువగా ఉండేవారు. కాలక్రమేణా అడవులు నరికివేయగా గ్రామాలు వెలిశాయి. అలా వ్యవసాయానికి పునాది పడింది. పెన్నా డెల్టాగా ప్రసిద్ధి గాంచింది. నెల్లూరు ప్రాంతాన్ని ఎన్నో వంశాలు పాలించాయి.
మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, తెలుగు చోళులు, పాండ్యులు ఏలారు. ఆ తర్వాత గజపతులు, విజయనగర రాజులు, మహమ్మదీయులు, గోల్కొండ సుల్తానులు, ఆర్కాటు నవాబుల ఆధీనంలోనూ కొనసాగింది. కాలక్రమేణ డచ్‌లు, ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చింది. జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమానికి వూపిరి పోసిన వారిలో పొట్టిశ్రీరాములు, ఓరుగంటి వెంకటసుబ్బయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, రేబాల లక్ష్మీనరసారెడ్డి, డాక్డర్ బెజవాడ గోపాలరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, పొణకా కనకమ్మ తదితరులు ఉన్నారు.
వరి విస్తారంగా పండే ప్రాంతం కావడంతో నెల్లూరుగా పేరు వచ్చిందని ప్రతీతి. ఇది తమిళనామం. ఆ భాషలో 'నెల్లు' అంటే వరి అని అర్థం. అలా నెల్లు+వూరు... క్రమేపీ నెల్లూరుగా వాడుకలోకి వచ్చిందంటారు. పచ్చని పొలాలతో ప్రశాంతమైన ప్రాంతం కావడం వల్ల నల్ల+వూరు (మంచి వూరు) క్రమేపీ నెల్లూరుగా మారిందన్న వాదనా ఉంది.
పల్లవుల కాలంలో నెల్లూరు అంతా అటవీ ప్రాంతం. అప్పట్లో చెట్లు కొట్టేస్తున్న సమయంలో ఒక ఉసిరిక చెట్టు కింద శివలింగం కనిపించింది. ఈ విషయం తెలిసిన ముక్కంటి రాజు గుడి కట్టించాడని, అలా ఏర్పడిన మూలస్థానేశ్వరస్వామి ఆలయం నెల్లూరు పట్టణానికి బీజమైంది. తమిళంలో నెల్లి అంటే ఉసిరిక. నెల్లి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షమైంది, కాబట్టి నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు.
నెల్లూరుకు సింహపురి అనే పేరు కూడా ఉంది. పల్లవరాజు సింహవిష్ణు పరిపాలించినందున ఈ పేరు వచ్చిందని చెబుతారు. పరాక్రమానికి, అసమాన శౌర్యానికి ప్రతీకగా విక్రమ సింహపురిగా 11వ శతాబ్దం వరకు పిలిచేవారు. రెండో మనుమసిద్ధి కాలం విక్రమ సింహపురికి స్వర్ణయుగం. జిల్లాలోని వెంకటగిరి రాజాలది 31 తరాల చరిత్ర. అనంతరం ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చింది. 1956 నవంబరులో ప్రస్తుతం ఉన్న మండలాలతో నెల్లూరు జిల్లా ముఖచిత్రం ఏర్పడింది. 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మారింది.
శిక్షణ కేంద్రాలు
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ కేంద్రం, ఏసి సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరు : 0861 2326401
ఐ.ఐ.హెచ్.టి., వెంకటగిరి : 08625-257260
ప్రభుత్వ ఐ.టి.ఐ., వెంకటగిరి : 08625-257479
గౌతమి నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్, వెంకటగిరి
రమణమ్మ ఐటిఐ, కోవూరు
డైట్ సెంటర్, పల్లిపాడు, ఇందుకూరుపేట మండలం
పాలిటెక్నిక్ కళాశాల, కావలి
పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐఐటి) వాకాడు : 08624 240208

పెన్నానది 
పెన్ననదికి మరో పేరు పినాకిని. జిల్లాకు సాగు, తాగునీరు అందించే పెన్నానది నెల్లూరు నాగరికతకు ఆధారం. కర్నాటక రాష్ట్రంలో చెన్నకేశవ కొండల్లో పుట్టిన ఈ నదిని 'ఉత్తర పినాకిని'గా పిలుస్తారు. మన రాష్ట్రంలోకి అనంతపురం జిల్లాలో ప్రవేశించి కడప జిల్లా మీదుగా వెలుగొండ కనుమల్లో పయనిస్తుంది. నెల్లూరు జిల్లాలోకి సోమశిల వద్ద ప్రవేశిస్తుంది. అనంతసాగరం, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, సంగం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు మండలాల మీదుగా 112 కి.మీ. ప్రవహించి ఉటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
 
జిల్లా పరిధిలో పెన్నానదిలో కోలగట్ల వద్ద బొగ్గేరు, సంగం వద్ద బీరాపేరు వాగులు కలుస్తాయి. నెల్లూరు వద్ద పెన్నానదిపై రోడ్డు, రైలు వంతెనలు ఉన్నాయి.
స్వర్ణముఖి
చంద్రగిరి కొండల్లో పుట్టిన స్వర్ణముఖి నది చిత్తూరు. నెల్లూరు జిల్లాల్లో 155 కి.మీ. దూరం ప్రవహిస్తోంది. నదిలో ఇసుక రేణువులు బంగారు వర్ణం కలిగి ఉండడంతో స్వర్ణముఖిగా పేరొచ్చింది. రేణుగుంట వద్ద రాళ్లకాలువ, గూడలి వద్ద మామిడి కాలువలు దీనిలో కలుస్తాయి. జిల్లాలో నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి, చిట్టమూరు, కోట, వాకాడు మండలాల మధ్యగా ప్రవహించి పులికాట్ సరుస్సుకు ఉత్తరంగా సిద్ధవరం వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. వర్షాకాలంలో నదికి ప్రవాహం వస్తే 13,740 శతకోటి ఘనపుటడుగులు వరదనీరు అందుతుంది.
బ్యారేజీ, చెక్‌డ్యాంల ద్వారా 10,663 శతకోటి ఘనపుటడుగుల నీటిని చెరువులకు మళ్లించి వ్యవసాయానికి వినియోగిస్తారు.
కండలేరు: వెలిగొండల్లో పుట్టిన కండలేరు రాపూరు, మనుబోలు తదితర మండలాల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది.
పిల్లాపేరు: ఉదయగిరి నియోజకవర్గంలోని పోలంగివారిపల్లి వద్ద మర్రివూట్ల జలాశయం, సీతారామపురం చెరువు ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలు కలసి పిల్లాపేరు ఏర్పడింది. సీతారామపురం, ఉదయగిరి మండలాల్లో ప్రవహిస్తూ గండిపాళెం జలాశయంలో కలుస్తుంది. దీని కింద ఉన్న 7వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుంది.
పైడేరు
అల్లూరు డెల్టా ప్రాంతంలో పాడిపంటలకు మూలాధారం పైడేరు. దగదర్తి, అల్లూరు, కొడవలూరు, విడవలూరు మండలాల మీదుగా ప్రవహించి పొన్నపూడి, గోగులపల్లి మధ్యన సముద్రంలో కలుస్తోంది. ఈ నాలుగు మండలాలతో పాటు బొగోలు ప్రాంతంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. పూర్వం రాజుల కాలం నాడే పైడేరు వాగు ద్వారా వచ్చే వరదనీటిని అల్లూరు చెరువుకు మళ్లిస్తూ కాలువలు తవ్వారు. దీంతో వ్యవసాయానికి సాగునీటి సమస్య ఎదురవ్వడం లేదు. ఫలితంగా ఈ ప్రాంతం పంటల అల్లూరుగా ప్రసిద్ధి చెందింది.
కైవల్య నది
జిల్లాలో వరదలకు కట్టలు తెంచుకుంటూ పరవళ్లు తొక్కే వాటిలో కైవల్య నది ఒకటి. వెంకటగిరి ప్రాంతంలోని వెలుగొండ అడవుల్లో పుట్టి చిల్లకూరు పరిధి గుమ్మళ్లదిబ్బ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. ఈ క్రమంలో దాదాపు 100 కి.మి.కిపైగా ప్రవహిస్తుంది. ప్రతి ఏడాది వర్షాలకు కైవల్య ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. వంతెనలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. వెలుగొండ అడవుల్లో కురిసిన వర్షానికి కాలువ వెంబడి వెంకటగిరి మీదుగా డక్కిలి పరిధి మాటుమడుగును తాకుతూ బాలాయపల్లి మీదుగా సైదాపురం ప్రాంతానికి వస్తుంది.
అక్కడి నుంచి నేరుగా విందూరు మీదుగా గూడూరు పట్టణ ప్రాంతాన్ని తాకుతుంది. ఇక్కడ మాత్రం కైవల్యను పంబలేరుగా పిలుస్తారు. అక్కడి నుంచి చిల్లకూరు పరిధి తిప్పగుంటపాళెం సమీపంలో గుమ్మళ్లదిబ్బ వద్ద సముద్రంలో కలుస్తుంది.
పెన్నా ఆనకట్ట
నెల్లూరు వద్ద 140 ఏళ్ల క్రితం నిర్మించిన ఆనకట్ట తరచూ తెగిపోయేది. కాటన్ దొర దీన్ని పరిశీలించి లోపాలను సరదిద్దారు. ఈ నెల్లూరు ఆనకట్ట కింద సర్వేపల్లి కాలువ, జాఫర్ సాహెబ్ కాలువ ఉన్నాయి. సర్వేపల్లి కాలువ ద్వారా సర్వే రిజర్వాయరుకు నీరు అందుతుంది.
సంగం ఆనకట్ట
పెన్నానదిపై సంగం ఆనకట్ట 1882-85 మధ్య నిర్మించారు. ఇక్కడ నుంచి జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకి సాగునీటి సరఫరా జరుగుతోంది. కనిగిరి రిజర్వాయరు ప్రధాన కాలువ, కావలి, కనుపూరు, దువ్వూరు కాలువలతో పాటు నెల్లూరు చెరువుకు సాగునీటి సరఫరా అవుతుంది. నెల్లూరు నగరంతో పాటు కావలి పట్టణంలో తాగునీటి సరఫరాకు ఇక్కడి నుంచే నీరు అందుతోంది. ప్రస్తుతం ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో ప్రత్యామ్నాయాంగా రూ.122 కోట్ల వ్యయంతో కొత్త బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. సంగం ఆనకట్ట నుంచి నాలుగు సాగునీటి కాలువలు ఉన్నాయి. కుడివైపు కాలువ ద్వారా నెల్లూరు చెరువుకు, ఎడమవైపు కాలువ ద్వారా కనిగిరి రిజర్వాయరుకు నీరు అందుతుంది. మూడోది దువ్వూరు కాలువ కాగా నాలుగోది కనుపూరు కాలువ.


సోమశిల ప్రాజెక్టు
పెన్నానదిపై సోమశిల వద్ద భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం 1971లో ప్రారంభించారు. దీని కింద కావలి కాలువ, దక్షిణ కాలువ, ఉత్తర కాలువలు ఉన్నాయి. ప్రస్తుతం 70 టీఎంసీల నీరు నిల్వ ఉంటోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 4.25 లక్షల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేయాలన్నది ఆశయం. అయితే నాలుగు కాలువల తవ్వకాలు, ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తికావలసి ఉంది. కావలి కాలువ ద్వారా 31 చెరువులకు నీటి సౌకర్యం ఏర్పడింది. ఖరీఫ్‌లో 10,400 హెక్టార్లకు, రబీలో 20,890 హెక్టార్లకు సాగునీరు అందుతోంది.
కండలేరు జలాశయం
తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కండలేరు జలాశయాన్ని 1983 సంవత్సరంలో రాపూరు మండలంలో చెల్లటూరు గ్రామం వద్దనిర్మించారు. దీని మట్టకట్ట పొడవు 11 కి.మీ. ఆసియాలోనే అతిపెద్ద మట్టిడ్యామ్‌గా గుర్తింపు ఉంది. ఈ జలాశయం పూర్తి సామర్థ్యం 68 టీఎంసీలు. తొలిసారిగా 2010లో 55 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ప్రతి ఏటా దీని నుంచి సత్యసాయి గంగ (కండలేరు-పూండి) కాలువ ద్వారా చెన్నై, తిరుపతి ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రిజర్వాయరు కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా ఇప్పటివరకు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
కనిగిరి రిజర్వాయరు
బుచ్చిరెడ్డిపాళెం మండలంలో నెల్లూరు-ముంబయి రహదారి పక్కనే కనిగిరి రిజర్వాయరు ఉంది. దీన్ని 1882-86 మధ్య నిర్మించారు. సుమారు 24 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 3.5 టి.ఎం.సిల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని అప్పటి బ్రిటిషు పాలకులు కట్టారు. దీని ద్వారా బుచ్చి, సంగం, దగదర్తి, కోడవలూరు, కోవూరు, విడవలూరు, అల్లూరు మండలాల్లోని వ్యవసాయ భూములకు సాగు నీరందుతుంది. ప్రధానంగా సదరన్, ఈస్ట్రన్, పైడేరు ఎస్కేప్, న్యూ వవ్వేరు, యలమంచిపాడు కాలువలు, మలిదేవి మేజరు డ్రెయిన్‌ల ద్వారా ఏడు మండలాల్లోని 1.40 లక్షల ఎకరాలకు అధికారికంగా, మరో 40వేల ఎకరాలకు అనధికారికంగా సాగునీరందుతుంది.
స్వర్ణముఖి బ్యారేజీ
వాకాడు వద్ద స్వర్ణముఖి నదిపై రూ.50 కోట్లతో బ్యారేజీ నిర్మాణాన్ని 2005లో చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కృషి ఫలితంగా 34 గేట్లతో బ్యారేజీ కార్యరూపం దాల్చింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ బ్యారేజీ ద్వారా 10 చెరువు పరిధిలోని 9200 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షాలకు వచ్చే వరద నీటిని ఇక్కడ నిల్వ చేసి కాలువల ద్వారా చెరువులకు విడుదల చేస్తారు. ఆయకట్టుకు సాగునీరు చాలకపోతే తెలుగుగంగ జలాలను ఇక్కడికి మళ్లించిన సందర్భాలు ఉన్నాయి.
అల్లూరు డెల్టా
అల్లూరు డెల్టాలో అంచెలంచెలుగా సాగు విస్తీర్ణం పెరిగింది. నేడు 40 వేల ఎకరాలకు విస్తరించింది. పైడేరు వాగు ప్రధాన నీటి వనరు. మొదట శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కేవలం నాలుగు వందల ఎకరాలకు అల్లూరు చెరువు నుంచి సాగునీరు అందేది. తరువాత కాలంలో 1200 వందల ఎకరాలకు పెంచారు. సర్ అర్థర్ కాటన్ మహాశయుడు 19 శతాబ్ధం నాటికి డెల్టా ఆధునికీకరణ పూర్తి చేశారు. బ్రిటిషు కాలం నాటి సాగునీటి పారుదల కట్టడాలు, తూముల ద్వారా అధిక విస్తీర్ణంలో పంట సాగు అవుతోంది.
నెల్లూరు జిల్లాకు జీవనాడి పెన్నానది. జిల్లాలో 112 కి.మీ. మేర ప్రవహించే ఈ నది సాగు, తాగునీటి కొరత తీరుస్తోంది. శతాబ్ధం పూర్వం ఈ నదిపై నెల్లూరు, సంగం వద్ద ఆనకట్టలు కట్టారు. వీటిద్వారా కోవూరు, నెల్లూరు, బుచ్చి, ఇందుకూరుపేట తదితర మండలాల్లో లక్షా అయిదు వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
జిల్లాలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా పంటల సాగు దైవాదీనం. అనిశ్చితి వాతావరణం సాగు విస్తీర్ణం, పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఖరీఫ్ కంటే రబీ సీజన్‌లోనే రెండింతల విస్తీర్ణంలో పంటల సాగు అవుతుంది. భారీ నీటిపారుదల కింద పెన్నా డెల్టా వ్యవస్థ ద్వారా 1.28 లక్షల హెక్టార్లకు మించి నీరు అందుతుంది. మధ్యతరహా నీటిపారుదల కింద ఉన్న కనుపూరు కెనాల్ ద్వారా 7,635 హెక్టార్లు, గండిపాళెం జలాశయం ద్వారా 6,478 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. సాధారణంగా సాగునీటి కాలువల ద్వారా చెరువులకు నీరు అందుతుంది. దీనికితోపాటు వర్షపునీరు చేరుతుంది. జిల్లాలో 1763 చెరువులు ఉండగా, వీటి కింద 2,98,375 ఎకరాలు ఆయకట్టు ఉంది. అనువైన పరిస్థితులు ఉంటే కాలువల ద్వారా 1.36 లక్షల హెక్టార్లు, చెరువుల ద్వారా 72 వేల హెక్టార్లు, బోర్లు- ఫిల్టర్‌పాయింట్ల ద్వారా 67 వేల హెక్టార్లు, ఇతర బావుల ద్వారా 25 వేల హెక్టార్లు, ఎత్తిపోతలు, ఇతర వనరుల ద్వారా 8వేల హెక్టార్లకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. జిల్లాలో దాదాపు 3 లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం ఉండగా ఒకసారికి మించి సాగునీరు అందుతున్న భూములు 69 వేల హెక్టార్లు.
 
గండిపాళెం జలాశయం
ఉదయగిరి మండలంలో పొన్నెబోయిన చెంచురామయ్య గండిపాళెం జలాశయం ఉంది. దీనిని మాజీఎమ్మేల్యే చెంచురామయ్య ఎమ్మేల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. ఈ జలాశయం నీటితో ఉదయగిరి, వరికుంటపాడు మండలాలకు చెందిన 16000 ఎకరాలకు నీటిపారుదల జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 8 వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. పూర్తయితే 16 వేల ఎకరాలకు నీరు అందుతుంది.
ప్రధాన పంట.. వరి
జిల్లా వ్యాప్తంగా 70 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధార పడి ఉన్నారు. ఇందులో 60 శాతం వరి సాగు చేస్తున్నారు. మొలగొలుకులు, నెల్లూరు మసూర, జిలకర మసూర, ఎంటీయూ 1010, బుడ్డలు వరి రకాలను ఎక్కువగా పండిస్తున్నారు. మినుము, వేరుశనగ, శనగ, నువ్వు వంటి మెట్టపైర్లతో పాటు ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు.
ఉద్యాన పంటలు: జిల్లాలో ఉద్యాన పంటలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వింజమూరు, గూడూరు, పొదలకూరు, కావలి, ఆత్మకూరు తదితర మండలాల్లో ఉద్యాన పంటలు ఎక్కువ. ప్రధానంగా నిమ్మ, మామిడి, బత్తాయి, అరటి, సపోటా సాగు చేస్తున్నారు. ఈ పంటలపై 20 శాతం రైతులు ఆధారపడి ఉన్నారు.
వరి, మినుము, వేరుశనగ, చెరకు, పచ్చిశెనగ, పొగాకు
రబీలో పంటల విస్తీర్ణం..
వరి - 5లక్షల ఎకరాలు
మినుము - 75వేల ఎకరాలు
వేరుశనగ - 12వేల ఎకరాలు
చెరకు - 20వేల ఎకరాలు
పచ్చిశనగ - 25వేల ఎకరాలు
పొగాకు - 30వేల ఎకరాలు
ఖరీఫ్‌లో.. రబీ విస్తీర్ణంలో నాలుగో వంతు సాగవుతుంది.
జిల్లాలో వర్షాల పరిస్థితిని బట్టి ఏడాదికి రెండు పంటలను మాత్రమే సాగు చేస్తున్నారు. సాగునీరు పుష్కలంగా అందే మండలాల్లో మూడో పంటను వేస్తారు. ఖరీఫ్ సీజన్‌లో మొదటి పంటగా 1.50లక్షల ఎకరాల్లో వరిని సాగుచేస్తారు. రెండో పంటగా రబీలో వరిని దాదాపు 5లక్షల ఎకరాల్లో రైతులు పండిస్తారు.
రైతుసేవలో చిరుధాన్య పరిశోధనకేంద్రం
అర్ధశతాబ్ధ కాలంగా మెట్ట రైతుకు వెన్నుదన్నుగా పొదలకూరులోని చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం చేయూతనందిస్తోంది. పొదలకూరు వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని పొదలకూరు, కలువాయి, చేజర్ల, రాపూరు మండలాల్లో సాగుచేసే మినుము, పెసర, కంది, శనగ వంటి మెట్ల పంటలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి అధిక దిగుబడలు సాధించే వంగడాలను ప్రవేశపెట్టారు. మినుములో పీబీజీ-1 రకం అన్ని కాలాల్లో సాగుకు అనుకూలంగా ఉండి మంచి దిగుబడులిస్తోంది. వ్యవసాయ సీజన్‌లో ఆధునిక వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు సలహాలు అందిస్తూ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు సేవలందిస్తున్నారు.
పెట్లూరు నిమ్మ పరిశోధన కేంద్రం
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరులో నిమ్మ పరిశోధనాకేంద్రం ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన 1992లో ఏర్పాటైన ఈ కేంద్రం కాలక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో చేరింది. ఇక్కడ చేసిన పరిశోధన ఫలితంగా తెగుళ్లను తట్టుకోగలిగిన పెట్లూరు సెలక్షన్-1 నిమ్మ వంగడాన్ని రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఇంకా పలు పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సాగు చేయగల ఇతర నిమ్మ జాతులపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
శాస్త్రవేత్త డాక్టర్ బి.జి.రాజులు : 9441937460

0 comments:

Post a Comment